Omkareshwar Temple ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారం అమరేశ్వరం (లేక) ఓంకారం అమలేశ్వరం (లేక) ఓంకారం మమలేశ్వరం. ధర్మము,అర్ధము,కామము,మోక్షములలో నాల్గొవదైన మోక్షం కలగాలంటే ఓంకారాన్నినిరంతరం జపించి నాల్గొవ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్నిదర్శించాలి.అసలు ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించడానికి కారణం ఏంటి ?ఓంకారం మమలేశ్వరం రెండు జ్యోతిర్లింగాలా? లేక ఒక జ్యోతిర్లింగమా? ఓంకారం మమలేశ్వరం ఎక్కడ ఉంది మరియు ఎలా చేరుకోవాలి ? మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Which One Is The Greatest Mountain-నారదుడు మరియు వింధ్య పర్వత రాజు సంభాషణ
శివ పురాణం ఆధారంగా జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం నారద మహర్షి శివున్ని దర్శించుకోవడానికి కర్ణాటకలో ఉండే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు.అదే సమయంలో శివాభిషేకం కొరకు వింధ్య పర్వత రాజు అక్కడికి వచ్చి శివుడిని పూజించాడు. శివ పూజ అనంతరం వింధ్య పర్వత రాజు నారద మహర్షిని గౌరవించి తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చాలని కోరాడు.ఈ లోకంలో నాకన్నా గొప్ప పర్వతం ఏదైనా ఉన్నదా అని అడిగాడు. అందుకు బదులుగా నారదుడు నువ్వు చాలా గొప్ప వాడివి కాని మేరు పర్వతం నీకన్నా పొడవైనది మరియు గొప్పది అని పలికాడు.అంతే కాకుండా మేరు పర్వతం పైన సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడు అని, శివుడికి నిలయం కాని వారు ఎంత గొప్ప వారైన వ్యర్ధులే అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
Omkareswar Lingam Avirbhavam-ఓంకారేశ్వర అమరేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం
అప్పుడు వింధ్య పర్వతరాజు తన వద్ద శివలింగం లేదని గ్రహించి ఎలాగైనా శివుడిని ప్రసన్నం చేసుకోవాలని భావించి ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్టించి ఆ లింగమున ఓంకారం అనే అక్షరం రాసి, పూజించి 6 నెలలు పాటు మహా తపస్సు చేసాడు.వింధ్య పర్వతరాజు తపస్సుకు మెచ్చి శివుడు ప్రతక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు పర్వత రాజు తాను అందరికన్నా గొప్పవాడిని కావాలని,ఎంత ఎత్తుకైనా పెరగగలగాలని అంతే కాకుండా నా పర్వతం పైన నీవు జ్యోతిర్లింగంగా వెలసి ప్రజలను ఆశీర్వదించాలి అని కోరుకున్నాడు.అనంతరం శివుడు తధాస్తు అని పలికి నువు కోరిన వరాలను ప్రసాదిస్తునాను అని, ఈ కొండను నర్మదా నది రెండు బాలుగా విభజించింది కనుక ఒక భాగం పైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా రెండువ భాగం పైన అమరేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాను అని వరం ఇచ్చాడు.ఈ ఓంకార అమరేశ్వర లింగాన్ని దర్శించి భక్తితో పూజించినా లేక ఈ కథను శ్రద్ధతో విన్నవాళ్ళకి పునర్జన్మ ఉండదు అనగా మోక్షం పొందుతారని వరం ఇచ్చాడు.
Ujjain Mahakaleshwar Temple In Telugu-చితా భస్మంతో అభిషేకించె ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం
Another Story Of Omkareswar-మరొక పురాణ గాధ
ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అనే పేరు రావడం వెనక మరొక పురాణ గాధ ప్రచారంలో ఉంది.శివ భక్తుడైన రాజా మాంధాత శివుడిని ధ్యానిస్తూ ఈ క్షేత్రానికి రాగా అక్కడున్నపర్వతం ఓం ఆకారంలో కనిపించింది.అప్పుడు రాజా మాంధాత ఈ క్షేత్రంలో శివుడి కోసం తపస్సు చేయగా శివ సాక్షాత్కారం కలిగింది.శివానుగ్రహం కలిగిన రాజు శివుడిని ఈ క్షేత్రం మీద వెలియమని కోరాడు. అప్పుడు పరమశివుడు రాజా మాంధాత యొక్క భక్తికి మెచ్చిఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా కొలువై ఓంకారేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతానని అంతర్దానమయ్యాడు. అలా వెలసిన లింగమే ఓంకారేశ్వర మమలేశ్వరం.ఈ క్షేత్రం నర్మదా నది ఒడ్డున ఉంది, అటువంటి నర్మదా నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నర్మదా నది యొక్క దర్శనం చేత సకల పాపాలు తొలుగుతాయి. నర్మదా నది తీరానా పితృకార్యం చేయడం వలన పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. అంతే కాకుండా ప్రతి 12 సంవత్సరములకు పుష్కరాలు జరిగే నదులలో నర్మదా నది కూడా ఒకటి.
Where And How To Reach Omkareswar Temple-ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం లింగం ఉంది.ఓంకారేశ్వర క్షేత్రం ఉజ్జయిని నుంచి 140 కిలోమీటర్లు మరియు ఇండోర్ నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది.దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు, రైలు మరియు విమాన మార్గాలు ఉన్నాయి.
రైలు ప్రయాణం :
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఇండోర్ రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 77 KM ప్రయాణించి ఓంకారేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు.
విమాన ప్రయాణం :
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఇండోర్ లోని రాణి అహల్యాబాయి ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 77 KM ప్రయాణించి ఓంకారేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు.
దర్శన వేళలు:
ఉదయం 5:00 AM నుంచి మధ్యాహ్నం 3:50 PM వరకు తిరిగి సాయంత్రం 4:15 PM నుంచి రాత్రి 9:30 PM వరకు.